logo

అనకాపల్లి వైసిపి ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వై వి సుబ్బారెడ్డి

ఆకర్ష్ టీవీ అనకాపల్లి:
అనకాపల్లిలోని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ భవనంలో వైఎస్ఆర్సిపి ఎంపీ ఎన్నికల కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంబించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే రీతిగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఎన్నికల్లో గెలుపుకు శుభ సూచకమని అని, సుదీర్ఘ రాజకీయ అనుభవం, కార్యకర్త స్థాయి నుంచి ఉపముఖ్యమంత్రి స్థాయి వరకు చేరుకున్న బూడి ముత్యాలనాయుడు ప్రస్థానం, గొప్పతనాన్ని ఎంపీ సత్యవతి కొనియాడారు. నిస్వార్థ రైతు బిడ్డ కు ఎన్నికలలో పట్టం కట్టాలని, తమ ఎమ్మెల్యే మరియు ఎంపీ ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థులను పార్టి అద్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తెలియజేశారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ప్రజలలోనే ఉంటానని, ప్రత్యర్థి పార్టీ నాయకులు పెత్తందారులని, తను రైతు బిడ్డనని ప్రజలలో ఒకడినని నిత్యం అందుబాటులో ఉండే తనను ఎంపీ అభ్యర్థిగా, మలసాల భరత్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదరించాలని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు కోరారు. తొలుత అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపి సత్యవతి, ఎమ్మెల్యే అభ్యర్థి భరత్, నియోజకవర్గాల నాయకులు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

0
21 views